Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుషి హత్య కేసులో సిబిఐ ఆరోపణలు కల్పితాలు: రాజేష్

Webdunia
ఆదివారం, 2 జనవరి 2011 (09:11 IST)
ఆరుషి హత్య కేసులో సాక్ష్యాలు ఏవీ దొరక్కపోవడంతో తొలుత ఆ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించిన సిబిఐ ఆ తర్వాత.. ఆమెను తన తండ్రే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే సిబిఐ ఆరోపణలను ఆరుషి తండ్రి రాజేశ్‌ తల్వార్‌ ఖండించారు. సిబిఐ తమ లోపాల్ని కప్పి పుచ్చుకోవడానికే ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

అంతే కాకుండా.. తమ ఇంటిలో పనిచేసిన హేమరాజ్‌ హత్యకు కూడా తననే తప్పు పట్టడాన్ని రాజేష్ దుయ్యబట్టారు. ఈ కేసులో సిబిఐ వ్యక్తం చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం ఊహాగానాలేనని రాజేష్ అన్నారు. విచారణ పేరుతో తనను ఇప్పటికే ఎంతగానో వేధించారని, ఈ కేసులో ఇలా విచారణకు గురి చేయడం ఇది రెండవసారని ఆయన వాపోయారు.

అమాయకుల విషయంలో సిబిఐ వ్యవహరించే తీరు ఇదేనా...? కుమార్తెను కోల్పోయిన తండ్రిని నేను అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ ఆరోపణలను ఆరుషి తల్లి సూపుర్ కూడా తిప్పికొట్టారు. తన భర్తపై సిబిఐ ఆరోపణలు చేయడం ద్వారా తమ మందకొడి దర్యాప్తును కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని ఆమె అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments