భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు శనివారం సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబటి భారత భూభాగంలోకి చొరబడేందుకు గత రాత్రి ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు.
పూంఛ్ జిల్లాలోని బాలాకోటే సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. సైన్యం కాల్పులు జరుపక పోయినప్పటికీ.. ఉగ్రవాదులు మాత్రం కాల్పులు జరిపారు. సుమారు గంట పాటు సాగిన ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడక పోయినప్పటికీ.. 50 యేళ్ళ మహ్మద్ సాగిర్ అనే పాక్ గైడ్ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.