Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో కీలక పత్రాలు మాయం

Webdunia
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెచ్చిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో కీలక పత్రాలు మాయమయ్యాయి. అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ పత్రాలు మాయం కావడం గమనార్హం. దీనికి సంబంధించి ఆ విభాగం కార్యదర్శి గురుదాస్ బాజ్‌పే ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మెరైన్ డ్రైవ్ పోలీసులు వెల్లడించారు.

పట్టణాభివృద్ధి విభాగం వర్గాల సమాచారం మేరకు.. ఆదర్శ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించి పది ఫైళ్లలో ఉన్న అనేక పత్రాలు మాయమైనట్టు డీసీసీ చెర్రింగ్ దూర్జీ వెల్లడించారు. ఈ పత్రాల మిస్సింగ్ విషయాన్ని సీబీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెల్సిందే.

కార్గిల్ యుద్ధంలో అశువులు బాసిన మృతుల కుటుంబాల కోసం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ద్వారా బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించగా, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు తమ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించుకున్నారు. ఇలాంటి వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ఒకరు. దీంతో ఆయనను మహారాష్ట్ర సీఎం పీఠం నుంచి తప్పించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Show comments