Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు: పవార్

Webdunia
శనివారం, 13 మార్చి 2010 (16:44 IST)
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ప్రకటించిన ఎన్సీపీ.. స్థానిక సంస్థల్లో ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది.

దీనిపై పార్టీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ... మహిళలకు యాభైశాతం సీట్లు కేటాయించాలని కోరారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థల్లో కేటాయించిన రిజర్వేషన్ల ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో తమ సత్తాను చాటారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారు.

ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో బాగా రాణిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్‌లలో సీట్లను 33 శాతం కేటాయించినట్టు గుర్తు చేశారు. ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా, శరద్ పవార్ కూడా యాభై శాతానికి మద్దతు తెలుపడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

Show comments