Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు: పవార్

Webdunia
శనివారం, 13 మార్చి 2010 (16:44 IST)
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ప్రకటించిన ఎన్సీపీ.. స్థానిక సంస్థల్లో ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది.

దీనిపై పార్టీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ... మహిళలకు యాభైశాతం సీట్లు కేటాయించాలని కోరారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థల్లో కేటాయించిన రిజర్వేషన్ల ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో తమ సత్తాను చాటారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారు.

ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో బాగా రాణిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్‌లలో సీట్లను 33 శాతం కేటాయించినట్టు గుర్తు చేశారు. ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా, శరద్ పవార్ కూడా యాభై శాతానికి మద్దతు తెలుపడం గమనార్హం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments