Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ జంట పేలుళ్లు: కీలక తీవ్రవాది అరెస్టు!

Webdunia
సోమవారం, 18 జనవరి 2010 (16:31 IST)
గత 2007 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్ళ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హర్కత్ అల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అజ్మద్ అలియాస్ షేక్ అబ్దుల్ ఖవాజాను చెన్నయ్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఈనెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకలను భగ్నం చేసేందుకు కుట్రపన్నినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒక సిటీలో ఈ విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేసినట్టు సమాచారం.

కాగా, 2007లో హైదారాబాద్‌లోని గోకుల్ ఛాట్, లుంబిని పార్కులలో జరిగిన జంట పేలుళ్లలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ కేసుతో పాటు.. 2005లో టాస్క్ ఫోర్స్ కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో అంజాద్ ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం.

గత 2003 సంవత్సరం నుంచి కరాచీలో ఉంటున్న అంజాద్.. రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు భారత్‌కు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు నిర్ణయించారు
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments