Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడో.. రేపో... అన్యోన్యమైన పరిష్కారం: మన్మోహన్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2009 (13:49 IST)
తెలంగాణ అంశ పరిష్కారానికి నేడో.. రేపో ఇరు వర్గాలకు అన్యోన్యమైన పరిష్కారమార్గం కనుగొంటామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానిని కలుసుకున్న సీమాంధ్ర ఎంపీలకు ఆయన హామీ ఇచ్చారు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు కావూరు సాంబశివరావు నేతృత్వంలో ప్రధానితో సమావేశయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోదని ఆయన హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమచారం. అదేసమయంలో ఇరు ప్రాంతాల వారిని నొప్పించకుండా ఉండేలా మధ్యేమార్గంతో పరిష్కారం కనుగొనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ సమావేశం అనంతరం ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం ఉండబోదని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అన్ని పార్టీలు అంగీకరించేలా అన్యోన్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదే విషయంపై కేంద్ర ఉక్క శాఖ సహాయ మంత్రి ఏ.సాయ్ ప్రతాప్ కూడా మాట్లాడుతూ.. సోమవారం రాత్రి ఆమోదయోగ్యమైన ప్రకటన చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిణామాలను, ప్రజలమనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమనిస్తోందన్నారు. మూడు ప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరుస్తుందన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments