Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పాఠశాల భవనాలను పేల్చివేసిన మావోలు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2009 (12:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. గిరిది జిల్లాలో రెండు పాఠశాల భవనాలను మందుపాతరలు అమర్చి పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, భవనం, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు వారు తెలిపారు. ధర్పహరి, హిరిధి అనే ప్రాంతాల్లోని రెండు ఉన్నత పాఠశాలల భవనాలు మావోల దుశ్యర్యకు నేలమట్టం అయినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు.

యాంటి నక్సల్స్ ఆపరేషన్ చేపట్టే పోలీసులు ఎక్కువగా పాఠశాల భవనాల్లో బస చేస్తూ ఉంటారు. అందుకే మావోయిస్టులు ఈ భవనాలను టార్గెట్ చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments