Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో భారత్-చైనాలు శాంతిని పరిరక్షస్తాయి: పీఎం

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2009 (17:59 IST)
సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించేందుకు భారత్-చైనాలు అంగీకరించాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తన రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకుని ఆయన ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం చైనా ప్రధాని వెన్ జియాబావోతో జరిగిన ముఖాముఖి చర్చల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలపై విస్పష్టంగా, నిక్కచ్చిగా మాట్లాడినట్టు చెప్పారు.

సరిహద్దు సమస్యతో పాటు.. ద్వైపాక్షిక అంశాలపై కూడా చైనా ప్రధానితో చర్చించినట్టు తెలిపారు. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని తెలిపారు. ప్రధానంగా సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపోతే.. బౌద్ధమత గురువు దలైలామా తమ గౌరవ అతిథి అని చెప్పారు. అయితే, వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా చేపట్టనున్న ప్రదర్శనపై మాత్రం డాక్టర్ మన్మోహన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments