Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌పై సైనిక చర్య చేపట్టబోము: ప్రణబ్

Webdunia
నవంబరు 26 దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై తాము ఎటువంటి సైనికి చర్య చేపట్టబోమని భారత్ మరోమారు స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రసంగిస్తూ... పాక్‌పై సైనిక లేదా దానికి సంబంధించిన ఎటువంటి చర్యను చేపట్టబోమన్నారు. అయితే కొన్ని పార్టీలు సైనిక చర్యను చేపట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేశాయని చెప్పారు.

ప్రభుత్వం ఆ సూచనలను తిరస్కరించిందని ప్రణబ్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన దేశాలపై బాధిత దేశాలు ప్రతీకార దాడులు జరిపిన ఉదాహరణలు లేకపోలేదనీ, గజాలో జరిగిన దాడుల ఇటుంవంటివేనని ఆయన గుర్తు చేశారు.

వందలమంది ప్రాణాలను బలితీసుకున్న ముంబయి ఉగ్రవాద దాడుల అంశాన్ని ప్రభుత్వం తనదైన శైలిలో పరిష్కరించి, పాకిస్తాన్ మెడలు వంచుతుందని తెలిపారు. ప్రాణాలను బలిగొనడం ద్వారా సమస్య పరిష్కారం కాదన్నారు. చుక్క నెత్తురు రాలిపడకుండా విజయం సాధించడం భారత్‌కు మాత్రమే తెలుసుననీ, అదే భారతదేశానికి ఉన్న అతి గొప్ప గుణమని అన్నారు.

ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి తెస్తామనీ, ఇంత జరిగినా తీవ్రవాదులకు ఆతిథ్యమివ్వడాన్ని మానుకోకపోతే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా మిగులుతుందని ప్రణబ్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments