Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీ

Webdunia
FileFILE
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అందువల్లే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు ఆమె శనివారం పచ్చజెండా ఊపారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై పెద్దగా లేదన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడలేదంటే అందుకు కేంద్రంలోని అధికార యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ప్రధాన కారణమన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చుకుంటే ఆర్థిక మాంద్యం చూపిన ప్రభావం మనపై నామమాత్రమే అన్నారు. అనంతరం మజూమ్‌ నుంచి బారాముల్లాకు నడిచే రైలును ప్రారంభించారు. మజూమ్‌ నుంచి బారాముల్లా మధ్య రైలు ప్రాజెక్టును ఓ సవాల్‌గా తీసుకుని పూర్తి చేసిన రైల్వేమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌, ఇతర రైల్వే అధికారులను ఆమె అభినందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments