Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీరీ మిలిటెంట్లు హింస మానాలి: ప్రధాని

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2008 (11:35 IST)
హింస ద్వారా ఏదీ సాధించలేరని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ మిలిటెంట్లు హింసాత్మక పంథాను వీడి జాతీయ స్రవంతిలో కలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. తీవ్రవాద పంధా చేపట్టిన నా యువ స్నేహితులు హింసా మార్గాన్ని వీడి జాతీయ రాజకీయ స్రవంతిలో చేరాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. కాశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

హింస ద్వారా ఏమీ సాధించలేమని మీరు తెలుసుకోవాలి. రక్తపాతం ద్వారా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. హింస మరణాలకు, విధ్వంసాలకు మాత్రమే దారితీస్తుందని ప్రధాని కాశ్మీరీ మిలిటెంట్లకు హితవు చెప్పారు. రాజకీయం లేదా ఆర్థికం.. ఇలా ఏ సమస్య అయినా శాంతియుత పద్ధతులలో, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని మన్మోహన్ చెప్పారు.

కాశ్మీరీ యువత భద్రతను, సౌభాగ్యాన్ని రుచి చూడలేదని తనకు తెలుసని, మీరు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించి, పాత గాయాలను మాన్పాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ , తన ప్రభుత్వం పనిచేస్తున్నాయని ప్రధాని చెప్పారు. సరిహద్దు రాష్ట్రమైన కాశ్మీర్‌ ప్రజల సంక్షేమానికి తమ పార్టీ, ప్రభుత్వం మనస్ఫూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో నిరుద్యోగాన్ని తొలగించి, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నొక్కి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments