Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైమానిక దాడులు జరగొచ్చు: అంటోనీ హెచ్చరిక

Webdunia
ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ సందేహం వ్యక్తం చేశారు. భూ, సముద్ర మార్గాల ద్వారా దాడులు నిర్వహించిన ఉగ్రవాదులు ఈ దఫా వైమానికి దాడులు నిర్వహించ వచ్చని ఆయన హెచ్చరించారు. అందువల్ల త్రివిధ దళాధిపతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అగ్రదేశం అమెరికాపై 9/11 తరహాలోనే ఈ దాడులు జరుగవచ్చని ఆయన సూచించారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సైనిక బలగాలను హెచ్చరించారు. రక్షణ, వైమానికి, నేవీ త్రివిధ దళాల అధిపతులతో మంత్రి ఆంటోనీ బుధవారం సాయంత్రం అత్యసర భేటీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా దళాలు, నిఘా సంస్థలు సమాచారాన్ని ఎప్పటికపుడు క్రోఢీకరించి పరిస్థితిని మదింపు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల వెంబడి బలగాలు మరింత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ఈ సమావేశంలో సైనిక దళాధిపతి జనరల్ దీపక్ కపూర్, వైమానికి దళాధిపతి ఫలి హోమీ మేజర్, నౌకాదళాధిపతి అడ్మిరల్ సురేష్ మెహతాలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీని రెడ్ అలెర్ట్ ప్రకటించాలని నిర్ణయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

Show comments