Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూలో రెండో విడత‌ ఎన్నికలు: 65 శాతం పోలింగ్

Webdunia
జమ్మూ-కాశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రెండో విడత ఎన్నికలను బహిష్కరించాలన్న వేర్పాటు వాదుల పిలుపును ప్రజలు ఏమాత్రం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఒకవైపు రాజౌరి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో తీవ్ర చలిని కూడా పట్టించుకోక వృద్ధులు తమ ఓటును ఉపయోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు బారులు తీరారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్‌లోని దర్హల్‌లో అధికంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లా పోటీ చేస్తున్న గందర్బల్‌లో 35 శాతం నమోదు కాగా, దర్హల్‌లో 46 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇదిలా ఉండగా, జమ్మూ-కాశ్మీర్‌లో ఈ నెల 17వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. పది నియోజక వర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఇకపోతే... జమ్మూలో మూడో పోలింగ్ ఓటింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

Show comments