Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2008 (02:29 IST)
జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం పది నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 55 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేసమయంలో చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ ఎన్నికలు దాదాపు ప్రశాంతంగానే ముగియడం అధికారుల్లో ఆనందాన్ని మిగిల్చింది.

పోలింగ్ విశేషాల గురించి ఎన్నికల ప్రధాన అధికారి బీఆర్ శర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల ప్రాబల్యం గల బండిపోరా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 74శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. అలాగే మెంధార్‌లో 65శాతం, సురాన్‌కోట్‌లో 58శాతం, కార్గిల్‌లో 57శాతం, నోబ్రాలో 55శాతం, లేలో 53శాతం పోలింగ్ జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో భారీగా పోలింగ్ జరిగే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో ఎన్నికలు జరిగే చాలా ప్రాంతాలు పోలీసుల, సైన్యం చేతిలో దిగ్భంధంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?