Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2008 (02:29 IST)
జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం పది నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 55 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేసమయంలో చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ ఎన్నికలు దాదాపు ప్రశాంతంగానే ముగియడం అధికారుల్లో ఆనందాన్ని మిగిల్చింది.

పోలింగ్ విశేషాల గురించి ఎన్నికల ప్రధాన అధికారి బీఆర్ శర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల ప్రాబల్యం గల బండిపోరా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 74శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. అలాగే మెంధార్‌లో 65శాతం, సురాన్‌కోట్‌లో 58శాతం, కార్గిల్‌లో 57శాతం, నోబ్రాలో 55శాతం, లేలో 53శాతం పోలింగ్ జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో భారీగా పోలింగ్ జరిగే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో ఎన్నికలు జరిగే చాలా ప్రాంతాలు పోలీసుల, సైన్యం చేతిలో దిగ్భంధంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు