యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీపడుతున్నారు. వచ్చే నవంబరులో జరిగే ఈ ఎన్నికల్లో వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత 1968లో వియత్నాం యుద్ధంలో పోరాడిన రాజీవ్ పటేల్ అక్కడి ఉత్తర కరోలినా నుంచి డెమెక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగనున్నారు. వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత పటేల్ నార్త్ కరోలినాలోని ఈస్ట్ స్పెన్సర్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు.
అలాగే మరో ఎన్.ఆర్.ఐ అనిల్ కుమార్. ఈయన అక్కడే వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన మిచిగాన్ ప్రతినిధుల సభ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, మూడో అభ్యర్థి సతీష్ వర్జీనియా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇంజనీరింగ్ పట్టాను అందుకున్న అనంతరం వ్యాపారవేత్తగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.