దక్షిణకొరియాలో జరిగిన పడవ ప్రమాదంలో వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కాంగ్ మిన్ క్యు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటుడిన ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
డాన్వాన్ హైస్కూల్కు చెందిన 352 మంది విద్యార్థులతో కలిసి వైస్ ప్రిన్సిపాల్ బెజు ద్వీపానికి నౌకలో విహారయాత్రకు బయల్దేరారు. ప్రమాదవ శాత్తు నౌక సముద్రంలో మునిగి పోయింది. విద్యార్థులు గల్లంతు కావడంతో ప్రిన్సిపాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారో ఏమో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.