Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్ట్, నైజీరియా బాంబు దాడులను ఖండించిన ఒబామా

Webdunia
సోమవారం, 3 జనవరి 2011 (14:22 IST)
కొత్త సంవత్సరం రోజున ఈజిప్ట్, నైజీరియా దేశాల్లో విషాదం నెలకొంది. ఈ దేశాలపై ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపి 50 మందికి పైగా అమాయక ప్రజలను ప్రాణాలను హరించివేశారు. కాగా.. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. "ఈజిప్ట్, నైజీరియాలపై ఉగ్రవాదుల బాంబు దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాన"ని హవాయ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న భక్తులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రావాదులు దాడులు జరిపారు. ఈ ప్రమాదంలో 21మంది మరణించగా.. క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు డజన్ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.

అలాగే.. నైజీరియాలో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి గుమిగూడిన అమాయకపు ప్రజలను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు బాంబులతో దాడులు చేసి మారణహోమం సృష్టించారు. ఈ ప్రమాదంలో 31 మంది అమాయక ప్రజలు మరణించారు. క్రిస్టియన్ భక్తులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులు చేశారని మానవ జీవితానికి గుర్తింపు, గౌరవం లేకుండా పోతున్నాయని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments