Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎన్ అతిథి గృహంపై ఉగ్రవాదుల పంజా: ముగ్గురు ఉద్యోగులు మృతి

Webdunia
మెషిన్ గన్ల హోరు, బాంబు పేలుళ్ల మోతలతో బుధవారం ఉదయం కాబూల్ నగరం దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున ఉన్న యుఎన్ అతిథి గృహాన్ని అధీనంలోకి తెచ్చుకున్న మిలిటెంట్లపై ఆఫ్ఘన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం అతిథి గృహంలో సుమారు 10 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ విదేశీయులు కావడం గమనార్హం. కాగా ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు.

అతిథి గృహాన్ని దిగ్భంధించినట్లు తెలుసుకున్న వెంటనే ఆఫ్ఘన్ భద్రతా దళం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ దాడిలో ఒక మిలిటెంట్ హతమైనట్లు తెలుస్తోంది. కాగా ముగ్గురు ఉద్యోగులను మిలిటెంట్లు పొట్టనబెట్టుకున్నట్లు సమాచారం. ఓ ఆఫ్ఘన్ పోలీసు అధికారి గాయపడ్డారు.

భవనంలోపల సుమారు ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘాతుకానికి తమదే బాధ్యత అంటూ తాలిబాన్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Show comments