రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపికి ఎందుకు సినిమా రంగంలోని వారంతా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నాగార్జున, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. కానీ మిగిలిన ప్రముఖులంతా బిజెపి నినాదం చేస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు రవిబాబు తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ... మంచి నాయకుడ్ని ఎన్నుకోండి. ఇన్నాళ్ళు దేశాన్ని పాలించిన నాయకులు పార్టీలు ఏం చేశాయి? ఇంకా కనీస సౌకర్యాలు లేని గ్రామాలున్నాయి. పట్టణాలున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మరి మతతత్వ పార్టీ బిజెపికి సపోర్ట్ విషయంలో స్పందిస్తూ.... మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. అది లేనినాడు వ్యర్థం. మోడీకి అది ఉంది. మన ప్రధాని మన్మోహన్ సింగ్ వేస్ట్ ఫెలో... దేశం గురించి పోరాడే సైనికుల్ని పొరుగు దేశాలవారు ముక్కలుముక్కలుగా కోసి పార్సిల్ చేస్తే.. దాన్ని ఖండించడానికి మూడు రోజులు ఆలోచించాల్సిన దౌర్భాగ్యపు ప్రధానమంత్రి ప్రపంచంలోనే ఉండడు. లుంబినీ పార్క్, ముంబై వంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించి యాక్షన్ తీసుకునే నాథుడే లేడు.
ముంబై ఘటనలో నిందితుడ్ని పట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్... ఇలా దేశం పరువు తీసే నాయకులు.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని ప్రధానమంత్రులు ఉంటే దేశం అధోగతే అవుతుంది. అందుకే మోడీ వంటి ధైర్యశాలి. ఎదిరించే వ్యక్తి రావాల్సిన అవసరం ఉందని ఘాటుగా స్పందించారు.
ఇదే విషయపై నాగార్జున కూడా ఇటీవలే మాట్లాడుతూ.... పొరుగు రాష్ట్రం వారు మన దేశాన్ని ఆక్రమించుకుంటుంటే.. అబ్బే అదేమిలేదని కబుర్లు చెప్పే ప్రధానమంత్రి, నాయకులు ఉన్నంతకాలం దేశం బాగుపడదు. బిజెపికి సపోర్ట్ అనేది సరైన టైంలో తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. చాలామంది నాగార్జున మోడీతో కలిశాడట. ఏదో వ్యాపార సంబంధమైన లావాదేవీలు కోసం అనే మాటలు విన్పించాయి. ఏ మాత్రం లేదు. దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసి చలించిపోయి.. ధైర్యంగా మాట్లాడి, పోట్లాడే నాయకుడు ఆయనలో కన్పించాడు. అందుకే వెళ్ళి కలిశాను అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే. ఆయన దేశ సమగ్రత కోసం ప్రాణాలయినా అర్పిస్తానంటున్నారు. అలాంటి తెగువ మోడీలో చూశాననీ, అందువల్ల మోడీని ప్రధానమంత్రిగా చూడాలని తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ సింహభాగం నటులంతా మోడీజపం చేస్తున్నారు.