రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నాయకురాలు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రి నుంచి సొంతవూరు ఆళ్ళగడ్డకి తరలించారు. కేర్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్లో తరలించారు. అంబులెన్స్ వెనుక శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, వైసీపీ నాయకులు వెళుతున్నారు.
కాగా, భూమా శోభానాగిరెడ్డి మరణవార్త విని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శోభానాగిరెడ్డి మరణవార్త విని పలువురు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, సినీ నటుడు రాజా, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తదితరులు కేర్ ఆస్పత్రికి వచ్చి శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.