Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభానాగిరెడ్డి భౌతికకాయం ఆళ్ళగడ్డకు తరలింపు!

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:56 IST)
File
FILE
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ కేర్ ఆస్పత్రి నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు తరలించారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డలో జరుగనున్నాయి. ఆమె ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరోవైపు భార్య మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆమె భర్త భూమా నాగిరెడ్డి షాక్‌కు గురై, స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది స్పందించడంతో ఆయన కోలుకున్నారు. భార్య మరణాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

వైఎస్సార్పీసీ నేత భూమా శోభానాగిరెడ్డి మరణవార్త విని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, శోభానాగిరెడ్డి మరణవార్త విని పలువురు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, సినీ నటుడు రాజా, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తదితరులు కేర్ ఆస్పత్రికి వచ్చి శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments