రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. అయితే, ఆమె బీపీ, పల్స్ రేట్లు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలోని ఐసీయు విభాగంలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శోభకు తగిలిన గాయాలు చాలా పెద్దవని చెప్పారు.
తలకు బలమైన గాయమయిందని, పక్కటెముకల దగ్గర మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయని చెప్పారు. పక్కటెముకల గాయాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తలకు అయిన గాయమే తీవ్రమైనదని చెప్పారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారని చెప్పారు.