టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోందని అందువల్లే ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని... అందుకే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.
కేసీఆర్ కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. తన నియోజకవర్గమైన హుజూర్నగర్ను ఎవరూ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఉత్తమ్ జోస్యం చెప్పారు.