రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఏమాత్రం జాప్యం జరిగినా మానవ బాంబుతో హత్య చేస్తామని కొందరు బెదిరించారని, అయినప్పటికీ తాను భయపడలేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం నెల్లూరు, వేదాయపాళెంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300 సీట్లు ఖాయమన్నారు.
త్వరలో సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జాప్యం చేస్తే మానవబాంబుతో చంపేస్తామని బెదిరింపులు వచ్చినా తాను భయపడలేదని ఆయన చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, పదవులపై తనకు వ్యామోహం లేదని ఆయన స్పష్టం చేశారు.