తనను ప్రేమించలేదనే కోపంతో మరదలిపై కత్తితో దాడిచేసి ఉన్మాదిలా మారాడు ఓ యువకుడు. అంతేకాకుండా అతడు కూడా ఒంటిపై పెట్రోలుపోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో బావ, మరదల్లిద్దరూ చావుబ్రతకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలావున్నాయి..
పాతబస్తీ కిషన్ బాగ్కు చెందిన యువకుడు తనని ప్రేమించాలని మరదలిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు శనివారం మరదలు ఇంటికి వచ్చి, ఆమెతో మాట్లాడుతూ కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్రరక్తస్రావమయింది. అంతేకాకుండా అతడు కూడా తనతో తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరదలి ఇంట్లోని కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని వారిద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.