తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నుంచి పోటీకి దిగిన నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందనీ, అందువల్ల ఆ సినిమా ప్రదర్శనను నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్ ను జగన్ పార్టీ కోరిన సంగతి తెలిసిందే. ఐతే దీనిపై తెదేపా వర్గాలు, బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఈ డిమాండ్ చేయడం చిత్రంగా ఉందనీ, ఒకవేళ లెజెండ్ ఆపివేయిస్తే సాక్షిలో నిరంతరం జగన్ నామ స్మరణ చేస్తూ కథనాలు, టీవీలో జగన్ కవరేజ్ ఇస్తూ వస్తున్నవన్నీ నిలిపివేస్తారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి లెజెండ్ పై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.