Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు : అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే!!

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2013 (09:09 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించాల్సిందేనని లేకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

విభజనకు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే విధానాన్ని కూడా ఇక్కడ పాటించాలన్నారు. కానీ, ఇక్కడ మాత్రం అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

371( డి), 371(ఇ) ఆర్టికల్స్‌ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. ఇక తనపై కేసుల మాఫీ కోసం వైసీపీ నేత వైఎస్ జగన్ బిజీగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

Show comments