Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ : యాత్రకు ఆటంకం!

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (09:14 IST)
File
FILE
కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ యాత్రను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, అఖిలాంధ్రులకు నాటి నుంచి నేటి వరకు అభిమాన హీరో అయిన నందమూరి తారకరామారావు (సీనియర్) విగ్రహానికి దండ వేసేందుకు సమయం చాలదని ఆయన చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ యాత్రలో భాగంగా చంద్రబాబు సోమవారం రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం చేరుకున్నారు. అయితే, అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలని చంద్రబాబును అభిమానులు కోరారు. కానీ, అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు, విగ్రహాలకు పూలమాలలు వేస్తూపోతే సమయం సరిపోదన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆ వెంటనే ఏకమైన అభిమానులు బాబు యాత్రతో పాటు.. ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే, ఈ సంఘటనతో చంద్రబాబు వెంట ఉన్న ప్రైవేటు సైన్యం వారిని పక్కకు లాగేసి, యాత్రను ముందుకు వెళ్లనిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

Show comments