రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వెనక్కి తీసుకోవాల్సిందే అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళేందుకే ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు.
హైదరాబాద్లో సభ పెట్టుకోవడం అప్రజాస్వామికం కాదని, సభ సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలో చేరతారని తెలిపారు. దీనివల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.