కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడుతున్నట్టు ఆయన వెల్లడించారు. అదేసమయంలో తాను వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాటసాని రామిరెడ్డి సోమవారం కర్నూలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఈయన కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యేగా ఉంటున్నారు.
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా... ఇరు ప్రాంతాల సమన్యాయం కోసం వైఎస్ జగన్ ఒక్కరే దీక్ష చేపట్టారని కాటసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ఆయనకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.