Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవనిగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం!

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2013 (15:30 IST)
FILE
కృష్ణా జిల్లా అవనిగడ్డ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీహరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అయిన సైకం రాజశేఖర్‌పై 61,644 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మిక మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, వైసీపీ దూరంగా ఉన్న విషయం విదితమే. దీంతో ఉప ఎన్నికలో బ్రహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ బరిలో నిలిచారు.

ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 92,309 ఓట్లు పోలుకాగా, శ్రీహరి ప్రసాద్‌కు 75,282 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. మరో స్వతంత్ర అభ్యర్థి రావి సుబ్రమణ్యంకు 3,389 ఓట్లు మాత్రమే వచ్చాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments