కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులపై కిరణ్ సోనియా, రాహుల్కు వివరించారు.
రాష్ట్ర విభజనతో ఏర్పడే నష్టాలు, కష్టాలను సోనియా, రాహుల్ గాంధీకి కిరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. కిరణ్ వెల్లడించిన అంశాలను సోనియా, రాహుల్ గాంధీ సావధానం విన్నారు.
అయితే అన్ని పార్టీల అభిప్రాయాల మేరకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, సోనియా గాంధీ కిరణ్తో తెలిపారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీ చెప్పారు.