Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుచూపు మేరలో తెలంగాణ రాష్ట్రం : టి ఎంపీల జోస్యం

Webdunia
బుధవారం, 9 నవంబరు 2011 (16:49 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలో ఉందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు జోస్యం చెప్పారు. తెలగాణ సాధన కోసం మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం విరమించుకున్న విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా టి ఎంపీలు కె.కేశవరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణ వస్తుందని తేలిపోయిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే అవకాశముందన్నారు.

ఒకవేళ స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని చర్చించి నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే పార్టీతో పాటు.. తమ ఎంపీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తారని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు.

రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆజాద్ తాజా ప్రకటన రాష్ట్రం ఏర్పాటుపై నమ్మకం కలిగిస్తోందని, మీడియా వార్తలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధమని మరో ఎంపీ కేకే తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments