Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుచూపు మేరలో తెలంగాణ రాష్ట్రం : టి ఎంపీల జోస్యం

Webdunia
బుధవారం, 9 నవంబరు 2011 (16:49 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలో ఉందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు జోస్యం చెప్పారు. తెలగాణ సాధన కోసం మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం విరమించుకున్న విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా టి ఎంపీలు కె.కేశవరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణ వస్తుందని తేలిపోయిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే అవకాశముందన్నారు.

ఒకవేళ స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని చర్చించి నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే పార్టీతో పాటు.. తమ ఎంపీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తారని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు.

రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆజాద్ తాజా ప్రకటన రాష్ట్రం ఏర్పాటుపై నమ్మకం కలిగిస్తోందని, మీడియా వార్తలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధమని మరో ఎంపీ కేకే తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

Show comments