Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రజలే అవిశ్వాసం పెట్టొచ్చు: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (15:55 IST)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విసిగిపోయిన సామాన్య ప్రజానీకం ఏదో ఒక రోజున కడుపు రగిలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పని చేయడం లేదన్నారు.

సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాలు, ఆందోళనలలో పాల్గొంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే మాత్రం ప్రజలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారన్నారు.

తెలంగాణ అంశాన్ని తొక్కిపెట్టడానికి కేంద్రం మంత్రి వర్గస్తరణ చేస్తే అది మూర్ఖత్వమే అవుతుందని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇకపోతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో ఎన్డీఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments