తెలంగాణ నేతలే సమైక్యరాగం వినిపించ వచ్చునేమో: హరీష్

Webdunia
శనివారం, 15 జనవరి 2011 (16:58 IST)
ప్రస్తుత మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగానికి జైకొట్ట వచ్చుననే సందేహం కలుగుతుందని తెలంగాణ ప్రాంత నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారన్నారని ఆరోపించారు.

ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు మెత్తబడటానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగం అందుకునేలా ఉన్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎవరు ఎలా మారినా తాము మాత్రం లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదన్నారు.

అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ లేదన్నారు. యువనేత జగన్‌కు బాహాటంగా 24 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల కేకేఆర్ సర్కారు మైనారిటీలో ఉందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. కేకేఆర్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఈ అంశంపై ఆయన వెనుకంజ వేస్తున్నారన్నారు. అంతేకాకుండా, వారిద్దరు కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కుట్ర పన్నుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

Show comments