Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరి హత్య కేసులో బాబు కీలక సూత్రధారి: భానుమతి

Webdunia
తన భర్త, మద్దెలచెర్వు సూరి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారి అని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు. తన భర్త హత్యకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

అనంతపురంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త హత్యకు పరిటాల రవి కుటుంబీకులే కారణమన్నారు. పరిటాల ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్‌ల నుంచి ముప్పు ఉందని తన భర్త హత్యకు గురికాకముందే తన వద్ద వాపోయాడన్నారు.

సూరి రాజకీయాల్లోకి వస్తే అనంతపురంలో తెదేపా అడ్రస్ లేకుండా పోతుందనే భయంతోనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రోత్సహంతోనే మాజీ ఎమ్మెలేలు నారాయణరెడ్డి, చెన్నారెడ్డి కుటుంబాలు అంతమయ్యాయన్నారు.

ఇకపోతే.. సూరి హత్య జరిగి ఇన్నిరోజులైనా భానును పోలీసులు పట్టుకోలేకపోవడం, కేసు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.

త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సీబీఐ విచారణ జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. భాను ఆస్తులు, సెల్‌ఫోన్ కాల్స్ ఆరా తీయడంపై పోలీసులు పెట్టిన దృష్టి భానును అరెస్టు చేసేందుకు పెట్టలేదని భానుమతి ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Show comments