Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి డీఎల్‌పై సహచర మంత్రివర్యుల చిర్రుబుర్రులు!!

Webdunia
బుధవారం, 12 జనవరి 2011 (10:24 IST)
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డిపై సహచర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇపుడు మన సర్కారు నడి సముద్రంలో నావలా ఉందని ఎవరినీ రెచ్చగొట్టినా మునిగేది మనమేనని వారు గుర్తు చేశారు.

అందువల్ల ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని పలువురు మంత్రులు ఆయన ఘాటుగానే చెప్పారు. అంతటితో ఆగని వారు ఏకంగా మంత్రి డీఎల్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు.

ఢిల్లీలో చేపట్టిన జల దీక్షలో జగన్ కొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తాను తలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని, తన దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధాపపడివుందన్నారు.

దీనిపై మంత్రి డీఎల్ హైదరాబాద్‌లో ఘాటుగానే స్పందించారు. జగన్‌కు చీము నెత్తురు ఉంటే ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు సహచర మంత్రులు ఆయనపై మండిపడ్డారు.

ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేల భవితవ్యంపైనే ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర సర్కారుకు కష్టాలు తప్పవని, అలాగే, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేస్తే కేకేఆర్ సర్కారు మైనారిటీలో పడిపోవడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుని ఎవరైనా మాట్లాడాలన్నారు. ఇష్టాను సారంగా మాట్లాడితే నష్టపోయేది మనమేనని పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు వాపోయారు. మొత్తం మీద జగన్ ఢిల్లీ జలదీక్షలో చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఇటు రాష్ట్ర సర్కారుకు ముచ్చెమటులు పట్టించేలా చేశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments