Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీక్షకు రాజకీయాలు అంటగట్టొద్దు: సబ్బం హరి

Webdunia
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి కృష్ణా జలాల కోసం హస్తినలో చేయనున్న ఒక్క రోజు దీక్షకు రాజకీయాలు అంటగట్టాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. యువనేత వై.ఎస్. జగన్ ఈ నెల 11న హస్తినలో చేపట్టనున్న దీక్ష రాజకీయ దీక్ష కాదని సబ్బం హరి మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే వై.ఎస్.జగన్ ఈ దీక్ష చేపట్టనున్నట్లు హరి వెల్లడించారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వానికి ఎత్తిచూపడం కోసమే జగన్ ఈ దీక్షను చేపడుతున్నారని హరి తెలిపారు. ఇంకా కృష్ణా జలాల విషయమై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ ఒక్క రోజు దీక్ష చేస్తున్నారని సబ్బం వెల్లడించారు.

మరోవైపు కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశ రాజధానిలో చేపట్టనున్న ఒకరోజు దీక్ష కోసం మద్దతుదారులు, అనుచరులతో కలిసి జగన్ ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలు దేరతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments