Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కిరణ్‌కు ప్రజా సమస్యలు తెలీవు: పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 9 జనవరి 2011 (11:45 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజాసమస్యలు తెలియవని పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వర్గం నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మళ్లీ విమర్శలు వర్షం కురిపించిన పెద్దిరెడ్డి, మంత్రిపదవుల లాంటివి ఏమీ లేకుండా నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కిరణ్‌కు ప్రజా సమస్యల గురించి ఏమీ తెలియవన్నారు.

పుంగనూరుకు రావాల్సిన గార్గేయ నదీ జలాలను ముఖ్యమంత్రి పీలేరువైపు మరలించుకుంటున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. పుంగనూరుకు నీరు సరిపోయిన తర్వాతే పీలేరుకు మరలించుకోవాలని, కానీ ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యత పీలేరుకు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాను మహాపాదయాత్ర చేపడతానని హెచ్చరించారు.

గార్గేయ జలాలు తన నియోజకవర్గానికి అక్రమంగా తరలిస్తున్న ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా తాను రెండు రోజుల పాటు 56 కిలోమీటర్ల మేర పుంగనూరు నుండి చేపడతానని చెప్పారు.ముఖ్యమంత్రిపై తనకు వ్యక్తిగత కక్ష్య లేదని అయితే తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా మాత్రమే ఈ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments