Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఫిల్మ్‌కు బ్రేక్: ప్రస్తుతానికి రాజకీయాలపైనే దృష్టి..!?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2011 (14:16 IST)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన కొత్త చిత్రానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణాలను గమనిస్తుంటే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చుని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో రాజకీయాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కంటే రాజకీయ రంగంలో పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయని చిరు భవిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన 150 చిత్రానికి కొద్ది కాలం విరామం ప్రకటించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఫిబ్రవరిలోనే చిరు చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ.. రాష్ట్రంలో తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం రాజకీయ స్థితిగతులు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలే అంతమాత్రంగా ఉన్న తన పార్టీని మరింత బలోపేతం చేసుకొని, ఒకవేళ మధ్యంతరమే వస్తే ఎలా ప్రతిస్పందించాలోనని భారీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కొత్త సినిమా గురించి మరో ఆరు నెలల తర్వాత ఆలోచిద్దామని మెగాస్టార్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. దీంతో త్వరలోనే వెండి తెరపై మరోసారి చిరును చూద్దామనుకున్న సగటు అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments