Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఫిల్మ్‌కు బ్రేక్: ప్రస్తుతానికి రాజకీయాలపైనే దృష్టి..!?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2011 (14:16 IST)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన కొత్త చిత్రానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణాలను గమనిస్తుంటే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చుని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో రాజకీయాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కంటే రాజకీయ రంగంలో పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయని చిరు భవిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన 150 చిత్రానికి కొద్ది కాలం విరామం ప్రకటించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఫిబ్రవరిలోనే చిరు చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ.. రాష్ట్రంలో తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం రాజకీయ స్థితిగతులు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలే అంతమాత్రంగా ఉన్న తన పార్టీని మరింత బలోపేతం చేసుకొని, ఒకవేళ మధ్యంతరమే వస్తే ఎలా ప్రతిస్పందించాలోనని భారీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కొత్త సినిమా గురించి మరో ఆరు నెలల తర్వాత ఆలోచిద్దామని మెగాస్టార్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. దీంతో త్వరలోనే వెండి తెరపై మరోసారి చిరును చూద్దామనుకున్న సగటు అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

Show comments