Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ ఉన్న తెలంగాణానే కోరుకుంటున్నాం: ఉత్తమ్

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (16:06 IST)
తెలంగాణలోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని ఆ ప్రాంతం తరపున కాంగ్రెస్ ప్రతినిధి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మెజారిటీ ప్రజలు రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని భావిస్తున్నారన్నారు.

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ప్రతులను అందజేసేందుకు హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడిస్తామన్నారు.

అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించకుండా ఉండాల్సిందని అన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున తెరాస కూడా ఈ సమావేశానికి హాజరై వుంటే బాగుండేదన్నారు.

రేపటి సమావేశం అనంతరం ఈనెల 20వ తేదీ ప్రాంతంలో మరో సమావేశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టమైన సమాచారం తనకు లేదన్నారు. అంతేకాకుండా, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సూచించి పరిష్కార మార్గాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

Show comments