Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ పేరు నమోదుకు ఈసీకి దరఖాస్తు సమర్పించిన వైవీ!!

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (14:40 IST)
కడప మాజీ ఎంపీ, యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. తాను ప్రకటించినట్టుగా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులోభాగంగా జగన్ వర్గానికి చెందిన అత్యంత కీలక నేత వైవీ.సుబ్బారెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ ఏర్పాట్లు జోరందుకున్నాయన్నారు. పార్టీ పేరులో మహానేత వైఎస్ఆర్‌తో పాటు కాంగ్రెస్ పేరు ప్రతిబింభించేలా ఉంటుందన్నారు.

అయితే, దీనిపై ఎన్నికల సంఘం నుంచి రెండుమూడు వారాల్లో ఒక ప్రకటన వెలువడుతుందన్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత అన్ని విషయాలను బహిర్గతం చేస్తామన్నారు. అంతేకాకుండా, పార్టీ పేరును ఖరారు చేసుకున్న తర్వాత విధివిధానాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ తన కొత్త పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేరుతోనే ఈసీని దరఖాస్తు సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

Show comments