Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ పేరు నమోదుకు ఈసీకి దరఖాస్తు సమర్పించిన వైవీ!!

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (14:40 IST)
కడప మాజీ ఎంపీ, యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. తాను ప్రకటించినట్టుగా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులోభాగంగా జగన్ వర్గానికి చెందిన అత్యంత కీలక నేత వైవీ.సుబ్బారెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ ఏర్పాట్లు జోరందుకున్నాయన్నారు. పార్టీ పేరులో మహానేత వైఎస్ఆర్‌తో పాటు కాంగ్రెస్ పేరు ప్రతిబింభించేలా ఉంటుందన్నారు.

అయితే, దీనిపై ఎన్నికల సంఘం నుంచి రెండుమూడు వారాల్లో ఒక ప్రకటన వెలువడుతుందన్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత అన్ని విషయాలను బహిర్గతం చేస్తామన్నారు. అంతేకాకుండా, పార్టీ పేరును ఖరారు చేసుకున్న తర్వాత విధివిధానాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ తన కొత్త పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేరుతోనే ఈసీని దరఖాస్తు సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

Show comments