Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన రాష్ట్రానికి గవర్నర్‌గా పిచ్చి వ్యక్తి: తెరాస నేత హరీష్ రావు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2011 (11:27 IST)
మన రాష్ట్రంలో ఒక పిచ్చి వ్యక్తి గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజ్‌భవన్‌ వీడి తెలంగాణ పల్లెల్లోకి వస్తే ప్రజల స్పందన ఏమిటో తెలుసుకోవచ్చని సూచించారు.

మెదక్ జిల్లా సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్ష చేపట్టి సోమవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు అడ్డొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చివరకు గవర్నర్‌ అడ్డు వచ్చినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అంతేకాకుండా, మన రాష్ట్రానికి ఓ పిచ్చి గవర్నర్‌ వచ్చారన్నారు. తెలంగాణా పట్ల హేళనగా మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

కష్టాలు పోవాలని ఓ వైపు తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే గవర్నర్‌ అవహేళనగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీ కృష్ణకమిటీ నివేదిక ఇచ్చే డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత జనవరి 1 వస్తుందంటూ హేళనగా మాట్లాడిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments