Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ నివేదిక ఫీవర్ : రాష్ట్రంలో ఎటు చూసినా బలగాలే!!

Webdunia
సోమవారం, 3 జనవరి 2011 (13:45 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇందులో పేర్కొన్న అంశాలు ఈనెల ఆరో తేదీన బహిర్గతం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిని వెల్లడించనున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయ సేకరణ జరిపి కేంద్రానికి నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. నివేదికలోని అంశాలు వెల్లడి కాబోతున్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కమిటీ నివేదిక వస్తుందని తెలియగానే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంపై దృష్టి సారించి, భారీ సంఖ్యలో బలగాలను రాష్ట్రానికి పంపిస్తున్నాయి.

ముఖ్యంగా, నివేదికలోని అంశాలు వెల్లడైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాక, అదనపు బలగాలు కావాలని రాష్ట్ర పోలీసు శాఖ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 150 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కోరింది. మొదటి విడతలో 20 కంపెనీలు, రెండో విడతలో మరో 30 కంపెనీల బలగాలను కేంద్రం డిసెంబర్‌ 30కి ముందే ఆంధ్రప్రదేశ్‌కు పంపించిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?