Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్-మధుయాష్కీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు

Webdunia
సోమవారం, 3 జనవరి 2011 (12:31 IST)
గత యేడాది సెప్టెంబరులో జరిగిన ఆందోళన సమయంలో హైకోర్టు విధులకు ఆటంకం కలిగించిన పలువురు తెలంగాణ నేతలతో పాటు న్యాయమూర్తులకు కోర్టు ధిక్కరణ నోటీసులను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ నోటీసులపై రెండు వారాల్లో సమాధానం తెలపాలని కోర్టు ఆదేశించింది

తెలంగాణ ఉద్యమంలో భాగంగా గత సెప్టెంబరు నెలలో పలువురు తెలంగాణ నేతలు హైకోర్టు జస్టీస్ నాగార్జున రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కార్యకలాపాలను అడ్డుకున్న విషయం తెల్సిందే. దీనిపై మనస్తాపం చెందిన నాగార్జున రెడ్డి తన పదవికి కూడా రాజీనామా చేయగా, చీఫ్ జస్టీస్ జోక్యంతో ఇది సద్దుమణిగింది. ఈ కోర్టు విధులకు ఆటంకం కలిగించడాన్ని ఖండిస్తూ ముగ్గురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించింది.

కోర్టు ధిక్కరణ కింద తెరాస అధినేత కేసీఆర్, ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే నాయిని నర్శింహారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీలతో పాటు.. బార్ కౌన్సిల్‌, బార్ అసోసియేషన్‌ నేతలకు, ఆందోళనలతో సంబంధం ఉన్న హైకోర్టు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం వివరణ ఇవ్వాలని గడువు విధించింది. సెప్టెంబరులో హైకోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి అన్ని వీడియోలను కోర్టు ముందు ఉంచాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments