Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షకు కోదండరామ్ మద్దతు!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2010 (13:50 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు చేపట్టిన నిరాహారదీక్షకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షాశిబిరం వద్దకు కోదండరామ్ వచ్చి తన మద్దతును ప్రకటించారు. వారి దీక్ష విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఎత్తివేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ఆహ్వానించినా వారిలో చలనం లేదన్నారు. ఇది వలసవాదుల దుర్మార్గాన్ని బయట పెడుతుందన్నారు.

ఇప్పుడు సొంత పార్టీవారే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ సాధనలో విజయం అయ్యే వరకు వారి పోరాటం కొనసాగించాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments