Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీని బతికించుకునేందుకే నిరవధిక దీక్ష: ఎంపీ పొన్నం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2010 (12:29 IST)
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకే నిరాహాదీక్షకు దిగినట్టు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌లో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, తెలంగాణాలో మొహరించిన బలగాలను తక్షణం ఉపసంహరించాలని కోరుతూ నిరాహారదీక్షకు దిగిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమించిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు.

కేసులను దశలవారీగా ఎత్తివేస్తున్నామని, దీక్షను విమరించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా తాము తోసిపుచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే 565 కేసులు ఉపసంహరించుకున్నట్టు సీఎం తెలిపారన్నారు. అయినప్పటికీ.. తాము దీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments