Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల మృతికి.. పంట నష్టానికి లింకు లేదు: సీఎం కేకేఆర్

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2010 (17:46 IST)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూరు కలికిరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలకు, పంట నష్టానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఈ రెండింటికి లింకు పెట్టి వార్తా కథనాలు రాయొద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. గుండెపోటుతో చనిపోతున్న వారిని కూడా ఆత్మహత్యలుగా చిత్రీకరించరాదన్నారు. మీడియా సంయమనంతో పాజిటివ్ కథనాలు రాయాలని కూడా ఆయన హితవు చెప్పారు.

ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి తొలిసారిగా శనివారం సొంత నియోజకవర్గమైన పీలేరులోని కలికిరి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయడంలేదన్న ప్రచారం వాస్తవంకాదన్నారు.

రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం రైతుల కోసం ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని తాను కూడా అనడంలేదని వివరణ ఇచ్చారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ మరింత పెంచాలని కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.

రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్.సీ.ఐ. కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నాయని, వీటిపై కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments