Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్స్ నుంచి బాబు డిశ్చార్జ్: 30న గుంటూరులో రైతు సభ

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2010 (17:23 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్స్ ఆస్పత్రి నుంచి శనివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు బాబుకు దిష్టి తీసి, హారతి పట్టారు. రైతు సమస్యలపై గత ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం రాత్రి మూడో కూటమి నేతలు వచ్చి బాబుకు నచ్చజెప్పి దీక్షను విరమింపజేశారు.

ప్రస్తుతం ఆయన తీవ్రమైన వంటి నొప్పులతో బాధపడటంతో పాటు.. బాగా నీరసంగా ఉన్నారు. ఆయన కోలుకోవడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని, పూర్తి విశ్రాంతి అవసరమని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ మధ్యలో ఎలాంటి బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించరాదని వైద్యులు సూచన చేశారు. అయితే, ఈనెల 30వ తేదీన గుంటూరులో భారీ ఎత్తున రైతు సదస్సు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీనికి అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments