Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ కుమార్ పని పట్టాల్సిందే: సన్నిహితులతో రాయపాటి

Webdunia
కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి వల్ల భవిష్యత్‌లో కమ్మవర్గానికి చెందిన నేతలు నోరు మెదపకుండా కూర్చోవాల్సి వస్తుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన సన్నిహితుల వద్ద వాపోయారు. దీన్ని ఆరంభంలోనే తుంచి వేయాలని లేకపోతే పార్టీ నుంచి లేదా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

సీఎం కేకేఆర్ మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై రాయపాటి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైపెచ్చు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఎలాంటి పనులు చేయించలేక పోతున్నామన్నారు. దీంతో ప్రజల ముందు తాము చేతగాని దద్దమ్మల్లా తయారవుతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండి ఏం లాభమన్నారు. అందుకే త్వరలోనే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర జనాభాలో రెడ్డి వర్గం జనాభా ఆరు శాతంగా ఉందని, కానీ, మంత్రివర్గంలో వారికి 13 శాఖలను, కమ్మ వర్గం జనాభా ఐదు శాతం ఉంటే కేవలం ఒకే ఒక్క శాఖను కేకేఆర్ కేటాయించి అవమానించారని రాయపాటి తన సన్నిహితులకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమ్మ వర్గ నేతలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని మంత్రివర్గం నుంచి పక్కన పెట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా మెతకవైఖరిని అవలంభించడం, ప్రజలను నిర్లక్ష్యం చేసినట్టేనని రాయపాటి అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments